Pages

Thursday, November 7, 2013

కార్తీక శుక్ల పంచమి - జ్ఞాన పంచమి - లక్ష్మీ పంచమి

కార్తీక శుక్ల పంచమి అలమేలు మంగత్తాయార్ ఆవిర్భావం

వేంకటాద్రి స్థల పురాణం ప్రకారం భృగు మహర్షి చేసిన చేష్టితానికి అందుకు విష్ణుభగవనాడు మిన్నకుండటాన్ని చూసి (పతికి/ గురువుకీ అవమానం జరిగిన చోట ఒక్క క్షణం ఉండరాదని ధర్మం) దుఃఖితవతియై పాతాళానికెళ్ళిపోయిందనీ, తరవాత సూర్య విష్ణుమూర్తి భూలోకంలో తపస్సుచేసుకునే సమయంలో సువర్ణముఖరీ నదీతీరంలో (ఇప్పటి తిరుచానూరు ) లో ఉన్న పద్మ సరస్సులో ఉన్న పద్మాల మధ్యలోంచి సువర్ణపద్మంలోంచి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాడ నక్షత్రంలో తిరిగి ఆవిర్భవించి,  కలువపూల దండలు స్వామికి సమర్పించి తిరిగి స్వామిని చేరిందని అలా ఒకరినొకరు అనుగ్రహించుకున్నారనీ స్థలపురాణంలో ప్రతీతి. పద్మ సరస్సు ఒడ్డున సూర్యభగవానుడు తపస్సు చేసిన స్థలం సూర్య ఆలయం ఇప్పటికీ మనం చూడవచ్చు.

పంచమీ తీర్థోత్సవం అని తిరుచానూరులో ఇప్పటికీ ప్రత్యేక వైభవోత్సవం చేస్తారు. అమ్మవారు అయ్యని తిరిగి చేరిన రోజు పరమ ప్రహృష్ఠంగా ఉంటారిద్దరూ. తిరుమలనుంచి ప్రత్యేక సారె తిరుచానూరుకి వస్తుంది ఏనుగులపై ఊరెరిగించి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు సారెను తిథినాడు.

కార్తీక శుక్ల పంచమి రోజున లక్ష్మీ ప్రీతిగా లక్ష్మీనారాయణులను ప్రత్యేకంగా అర్చించటం విశేష అభిషేక అర్చనాదులు నిర్వహించడం పరిపాటి. లక్ష్మీ మంత్ర దీక్ష ఉన్నవారు ప్రత్యేకంగా రోజు అనుష్ఠానాదులు పెంచుకుంటారు. గురువుల అనుగ్రహంతో కొత్తగా ఆదీక్ష తీసుకునేవారు కూడా నాడు తీసుకుంటూంటారు.

తన పతి చోట అవమానింపబడ్డాడో చోటు విడిచింది అమ్మవారు, అంటే ఆది లక్ష్మియైనా సరే పతినింద, గురునింద తట్టుకోలేదన్నమాట. విష్ణుమూర్తే భృగుమహర్షితో అనునయంగా మాట్లాడినా తన భర్తకు జరిగిన అవమానాన్ని తాను భరించలేకపోయింది (మనకీ గురునింద వినరాదు, గురునింద జరిగేచోటునుండి వెంటనే వెళ్ళిపోవాలి అని శాస్త్రాలు/పెద్దలు చెప్తారు)కాబట్టి అయ్యవారిని విడిచి కాకుండా అమ్మవార్ని సంతుష్టురాల్ని చేయటానికిఅయ్యవార్ని అమ్మవార్నికలిపి పూజించండి. వీలైతే విష్ణు సహస్రనామం/ గోవిందనామాలు పారాయణ చేసి అమ్మవారి అష్టోత్తరనామాలతో పూజించుకోవడం శ్రేష్ఠం. వేదాంతర్గత సూక్త పారాయణ చేయగలిగేవారు పురుష సూక్త, శ్రీ సూక్తపారాయణలు అర్చనలు చేసుకోవచ్చు. లేదా హయిగా దేవాలయంలో దర్శనం చేసుకొని అర్చనాదులు చేయించుకోవడం ఉత్తమం. , ఇతర లక్ష్మీ దేవి స్తోత్రాలూ పూజలో అనుసంధానం చేసుకోవచ్చు.

ఇక పంచమిని జ్ఞాన పంచమి అని కూడా పిలుస్తారు, రోజు సుబ్రహ్మణ్యారాధన వలన జన్మ్యాంతరంలో సుబ్రహ్మణ్యానుగ్రహం వలన శుద్ధజ్ఞానం కలుగుతుందని విశ్వసిస్తారు. జనపదాల్లో ఇదే నాగపంచమిగా కూడా జరుపుతుంటారు.
--
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు जय जय शंकर हर हर शंकर
Visit this group at http://groups.google.com/group/satsangamu.


No comments:

Post a Comment