Pages

Tuesday, December 1, 2015

దుస్సంగమును వర్జించాలి

జగద్గురు భారతీ తీర్థ స్వామి బోధ

మానవ మేధస్సు, బుద్ధి జీవితంలో గొప్ప పాత్రని పోషిస్తాయి. దానిని అదుపులో ఉంచుకోవడం ద్వారా వ్యవసాయాత్మిక బుధ్దిని ఎప్పుడూ ప్రోది చేసుకోవాలి. దానివల్ల నిత్యము సంతుష్టులై ఉండగలరు. లేకపోతే దుఃఖములు లేదా చెడుఫలితములను పొందగలరు. 

ఒకానొక రాజు వద్ద కొందరు మంత్ర్రులు, సేవకులు ఉండేవారు వారిలో ఉత్తముడైన భర్ఛు అనే సేవకుడు ఆ రాజుగారికి అత్యంత విశ్వాసపాత్రుడు రాజుమెచ్చినవాడు ఆరాజు ఆంతరంగికుడూనూ. ఈ విషయం మంత్రులకి గిట్టేది కాదు. ఒకనాడు పథకం వేసి బెదిరించి ఆ సేవకుణ్ణి ఎత్తుకు పోయి అడవిలో వదిలి వచ్చేసారు. రాజుగారికి ఆ సేవకుడు అడవిలో క్రూర మృగాల వల్ల చనిపోయాడని చెప్పి కట్టుకథ అల్లి నమ్మించారు. ఆ రాజు కూడా నిజమని నమ్మి మంత్రుల సహచర్యంలో రాజ్యం నిర్వహిస్తూండేవాడు. ఒకనాడు ఆ రాజు అడవికి వేటకెళ్ళాడు. వేటలో తిరిగి తిరిగి ఎన్నో మృగాలను చంపి అలసిపోయి విశ్రమిస్తూండగా అక్కడ అడవిలో మంత్రులచే వదిలివేయబడ్డ సేవకుడు తారసపడ్డాడు. ఆశ్చర్యానికి లోనైన రాజు తేరుకొని ఆ సేవకునితో మాట్లాడకుండా అతనిని పలకరించకుండా తిరిగి తనతో తీసుకెళ్ళకుండా రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. కారణం తన మంత్రులు చెప్పినదే నమ్మి ఆ కనపడ్డది తన సేవకుని ప్రేతాత్మగా తలవడం.

ఒక్కసారి దుస్సాంగత్యానికి అలవడ్డామా ఎంత సద్విషయమైనా తలకెక్కదు. దీన్నే సహవాస దోషం / దుస్సంగం అంటారు. దుస్సంగత్వం వల్ల శ్రుతి బోధలూ , గురు బోధలూ కూడా పెడచెవినపెట్టే విషయములుగా తోస్తాయి. ప్రతి ఒక్కరూ ప్రయత్న పూర్వకంగా దుస్సంగమును వర్జించాలి!