Pages

Friday, June 14, 2019

పూజారి = పూజ+అరి అంటే "పూజకు శత్రువా"


ఆమధ్య ఎవరో పూజారి అనకూడదు తప్పు పూజారి అంటే పూజకు శత్రువు అన్నారట. అది తప్పుడు అన్వయం, భాష తెలీకపోవడం చేత ఏర్పడిన అయోమయం. పూజారి రెండు పదాల కలయిక కాదు.

అలాగే వంటరి కూడా. "వంటరి" అంటే "వంటచేసేవారు, పాచకుడు" అని నిఘంటు అర్థం. ఇది వృతి పని చేసేవారినుద్దేశించి ఉన్న పేర్లలో ఒకటి.  

కుమ్మరి, పూజారి, కమ్మరి, వంటరి ఇలా ఇవి ఏకపదాలు. ఇవి ఆయా వృత్తులు చేసేవారి పేర్లు.

ముర+అరి = మురారి లాగా ఇవి రెండు పదాల కలయిక కావు.

-శంకరకింకర

Thursday, June 13, 2019

రఘుపతి రాఘవ రాజారాం వక్రీకరణ

పెద్దగీతను చిన్నది చేయాలంటే.. దాని పక్కన ఇంకో పెద్దగీత గీయడం ఒక పద్ధతి. కానీ పెద్ద గీత గీయలేనితనం లేదా విషయంలేక గొప్పదిగా చూపడం కుదరకపోతే? అసలు పెద్దగీతని, గొప్పతనాన్ని చిన్నదిగా చూపడం... అనాదిగా మనిషి బలహీనత.. అదే జరిగిందిక్కడా...

-శంకరకింకర

రఘుపతి రాఘవ రాజారాం వక్రీకరణ

ఈ మాట వింటూనే నోటి వెంబడి పాట వస్తుంది.
రఘుపతి రాఘవ రాజారాం  పతిత పావన్ సీతా రాం
ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్
నిజానికి ఇది మన జాతి పితగా వ్యవహరింపబడే గాంధీ గారు అసలు భజనను మార్చి వ్రాసినది. ఇది భారతీయులందరి కొరకు వ్రాసినది అని చెబుతారు. విష్ణు దిగంబర్ పాలుస్కర్ గారు దీనిని పాడి ప్రచారములోనికి తెచ్చినారు. దీనికి మూలమగు భజన రచయిత మరుగున పడిపోయినారు, కానీ దీనిని హిందువులు తప్ప అన్యులు పాడుట అరుదు. ఇందులో క్రీస్తు పేరు లేదని క్రైస్తవులు పాడరు. రాముని పేరు వుందని ముస్లిములు పాడరు. మరి గాంధీ గారు ఎవరి కొరకు వ్రాసినారన్నది మీ ఊహకు వదులుతాను.

అసలు ఈ భజన పుట్టుపూర్వోత్తరములకు పోతే దీని మొదటి రెండు చరణములు నామరామాయణములోనివి. ఈ రెండు చరణములతో లక్ష్మణాచార్య గారు ఈ క్రింది భజనను వ్రాసినారు. చదువుతూ వుంటే అర్థమగుట లేదా లక్ష్మణాచార్యులవారు తెలుగువారని. ఎందుకంటే ఈ చిన్న భజనలో మన భద్రాద్రి రాముడు చోటు చేసుకొన్నాడు.

రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతా రాం
సుందర విగ్రహ మేఘశ్యాం
గంగా తులసీ సాలగ్రాం
భద్రగిరీశ్వర సీతారాం
భక్త జనప్రియ సీతారాం
జానకి రమణా సీతారాం
జయ జయ రాఘవ రాజారాం 

-చెరుకు రామ మోహన్ రావు, Cheruku Rama Mohan Rao (Saturday, 23 December 2017)

Tuesday, June 11, 2019

అఙ్గారకస్తోత్రమ్

॥ అఙ్గారకస్తోత్రమ్ ॥

అస్య శ్రీ అఙ్గారకస్తోత్రస్య ।
విరూపాఙ్గిరస ఋషిః ।
అగ్నిర్దేవతా ।
గాయత్రీ ఛన్దః ।
భౌమప్రీత్యర్థం జపే వినియోగః ।
అఙ్గారకః శక్తిధరో లోహితాఙ్గో ధరాసుతః ।
కుమారో మఙ్గలో భౌమో మహాకాయో ధనప్రదః ॥ ౧॥

ఋణహర్తా దృష్టికర్తా రోగకృద్రోగనాశనః ।
విద్యుత్ప్రభో వ్రణకరః కామదో ధనహృత్ కుజః ॥ ౨॥

సామగానప్రియో రక్తవస్త్రో రక్తాయతేక్షణః ।
లోహితో రక్తవర్ణశ్చ సర్వకర్మావబోధకః ॥ ౩॥

రక్తమాల్యధరో హేమకుణ్డలీ గ్రహనాయకః ।
నామాన్యేతాని భౌమస్య యః పఠేత్సతతం నరః ॥ ౪॥

ఋణం తస్య చ దౌర్భాగ్యం దారిద్ర్యం చ వినశ్యతి ।
ధనం ప్రాప్నోతి విపులం స్త్రియం చైవ మనోరమామ్ ॥ ౫॥

వంశోద్ద్యోతకరం పుత్రం లభతే నాత్ర సంశయః ।
యోఽర్చయేదహ్ని భౌమస్య మఙ్గలం బహుపుష్పకైః ॥ ౬॥

సర్వా నశ్యతి పీడా చ తస్య గ్రహకృతా ధ్రువమ్ ॥ ౭॥

॥ ఇతి శ్రీస్కన్దపురాణే అఙ్గారకస్తోత్రం సంపూర్ణమ్ ॥

కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి

Collection.. from whatsapp


న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతి మహో
న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథాః
న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం
పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణమ్ || ౧ ||

అమ్మానాకు మంత్రాలు తెలియవు,యంత్రాలు తెలియవు. నిన్ను స్తుతిచేసే మతిలేదు. నాకు నిన్నుపాసన చేసే ముద్రలు తెలియవు. ఇవియన్నీ నా బాధలు అని చెప్పుకొని ఏడ్వలేను. నాకు తెలిసినది ఒకటే. నిన్ననుసరించుటయే నా దుఃఖములకు ఉపశమనము.

విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా
విధేయా శక్యత్వాత్తవ చరణయోర్యాచ్యుతిరభూత్
తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || ౨ ||

నా అజ్ఞానముచేత, అశక్తతచేత, నా సోమరితనము చేత, నా దౌర్బల్యముచేత, నేను పెట్టదలచిన నైవేద్యము నీ పాదములనంటినది. తల్లీ శివా, భవానీ, రుద్రాణీ నన్ను క్షమించు.అందరినీ ఉద్ధరించే తల్లీ నీకు తెలియనిదేమున్నది. చెడ్డ కుమారుడు ఉండటం లోక సహజము కానీ చెడ్డ తల్లి ఉండదు కదా!

పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః
పరం తేషాం మధ్యే విరల విరలోzహం తవ సుతః
మదీయోzయం త్యాగః సముచిత మిదం నో తవ శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || ౩ ||

అమ్మా అనేకానేకమైన నీ సుపుత్రుల నడుమ,నాది,నాకు అన్న స్వార్థ పూరిత వాంఛలచే పెనుగొనబడి శమ దమాదులను అధిగమించలేక పడియున్నాను.నాకున్న ఒకేఒక అర్హత నీ కుమారుని కావటమే. తల్లీ శివా! అదిచాలదా నన్ను ఉద్ధరించుటకు. అయినా చెడ్డ కుమారుడు ఉండటం లోక సహజము కానీ చెడ్డ తల్లి ఉండదు కదా!

జగన్మాతర్మాతస్తవ చరణ సేవా న రచితా
న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా
తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || ౪ ||

అమ్మా! జగన్మాతలకు మాతా! నీ పాదసేవ నేను చేసినదేలేదు. నీ పద సన్నిధిన నేనుంచిన నైవేద్యము ఏమీ లేదు. నిరుపమానమైన నీ కనికరమునకు నీ పుత్రుని నుండి అవి నీకు కావలెనా. అయినా చెడ్డ కుమారుడు ఉండటం లోక సహజము కానీ చెడ్డ తల్లి ఉండదు కదా!

పరిత్యక్తా దేవా వివిధ విధ సేవాకులతయా
మయా పంచాశీతేరధిక మపనీతే తు వయసి
ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాzపి భవితా
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణమ్ || ౫ ||

అమ్మా! 85సంవత్సరముల వయసు వచ్చినా నాకు ఏవిధమైన పూజా విధానాలూ తెలియవు. నేను చేయ గలిగినది నీ శరణు కోరడమే. ఎటువంటి ఆశ్రయముమూ లేని నాకు నీవు కాక ఆశ్రయము వేరేవ్వరివ్వగలరు ఓ లంబోదరజననీ!

శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా
నిరాంతంకోరంకో విహరతి చిరం కోటికనకైః
తవాపర్ణే కర్ణే విశతి మను వర్ణే ఫలమిదం
జనః కో జానీతే జనని జపనీయం జప విధౌ || ౬ ||

తల్లీ అపర్ణా! నీమహిమనేమని కొనియాడను. నీ మహిమతో చండాలుడు కూడా మదుర మధురతర మంజుల వాణిని వినిపించగలడు, నిర్ధనుడు కూడా ధనవనమున ధాటిగా నడయాడగలడు, కేవలము నీ నామామృతము వారి కర్ణ రంధ్రములు సోకినచాలును.మరి అంత మహిమగల నీ నామము అనుష్టాన నియమములతో అకుంఠితముగా జపించే వారి అదృష్టమును ఏమని కొనియాడవలెను.

చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో
జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతిః
కపాలీ భూతేశో భజతి జగదీశైకపదవీం
భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటీఫలమిదమ్ || ౭ ||

అమ్మా చితాభస్మమును ధరించువాడు, విషమును కంఠమునందు దచుకున్నవాడు, దిక్కులనే వస్త్రములుగా ధరించినవాడు, జడలు కట్టినవాడు, పాములను ధరించిన వాడు, భుతములతో తిరుగాడువాడు, కపాలములో భుజించువాడు అయిన శివుడిని జగత్ప్రభువు అనుటకు  కారణము నీవాయన అర్దాగివి అగుట వల్లనే కదా అమ్మా!

న మోక్షాస్యాకాంక్షా న చ విభవవాంఛాపి చ న మే
న విజ్ఞానాపేక్షా శశిముఖి! సుఖేచ్ఛాపి న పునః
అత స్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై
మృడానీ రుద్రాణీ శివ శివ భవానీతి జపతః || ౮ ||

అమ్మా నేను ధన,కనక,వస్తు,వాహన కామినీ కాదు మోక్షగామినీ కాదు,శాస్త్రజ్ఞత కూడా నాలో శూన్యమే.తల్లీ ఇందుముఖీ నాకు ఏ సుఖ సంతోషాలూ వద్దు. నాకు నీవెన్నిజన్మలు కలిగించ బోవుచున్నా అన్ని జన్మలలోనూ నాకు నీ నామములైన "మృడాని,రుద్రాణి,శివా,భవానీ" మొదలయిన వీనినే నేను సదా స్మరించు నటుల చేయి వరంబునీయుము తల్లీ.

నారాధితాసి విధినా వివిధోపచారైః |
కిం సూక్ష్మచింతనపరైర్న కృతం వచోభిః ||
శ్యామే! త్వమేవ యది కించన మయ్యనాథే |
ధత్సే కృపాముచితమంబ పరం తవైవ || ౯ ||

అమ్మా శ్యామా! నేను వేదచోదితమైన మంత్రపఠనముతో, ఉదాత్తానుదాత్త స్వరములతో,అచంచలమైన భక్తితో నిన్ను కోలుచుటలేదు. నాకుతెలిసినదల్లా నా భాషలో నా ఘోష వినిపించడమే.అయినా నన్ను నీ అక్కున చేర్చుకోన్నావంటే నవనీత హృదయముతో కూడిన నీవు నా హృదయావేదన గుర్తిన్చినావు. నీవు ఈ జగత్తుకే అతీతురాలివి కదా.

ఆపత్సుమగ్నస్స్మరణం త్వదీయం | కరోమి దుర్గే కరుణార్ణవే శివే |
నైతచ్ఛఠత్వం మమ భావయేథాః | క్షుధాతృషార్తా జననీం స్మరంతి || ౧౦ ||

అమ్మా దుర్గా! దయా సాగరీ! ఆపదలలో మాత్రమే నిన్ను తలచుతానని "అవసరార్థి నైన" నన్ను అసహ్యించుకోవద్దు. బిడ్డకు ఆకలైతే తలచుకోనేది తల్లినేకదా!

జగదంబ విచిత్ర మత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి చే న్మయి |
అపరాధపరంపరావృతం న హి మాతా సముపేక్షతే సుతమ్ || ౧౧ ||

అమ్మా జగన్మాతా! నీవు పోతపోసిన కరుణా మూర్తివి. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు.అందుకే తనయుడనైన  నా తప్పులెన్నున్నా తప్పనిసరిగా నన్నుపేక్షింపక నీ అక్కున చేర్చుకొంటావు అమ్మా!

మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నీ త్వత్సమా న హి |
ఏవం జ్ఞాత్వా మహాదేవీ యథా యోగ్యం తథా కురు || ౧౨ ||

నేనే అధమాధముడను.నాకన్నా అధములు వుండరు కదా.
నాకు మాత్రమే మంచి జరగాలి అనుకుంటు దాని వలన లోకానికి ఎంత కీడు జరుగుతుందో ఆలోచించనివాడిని, ఏది కోరుకోవాలో కూడా తెలియని వాడిని.
అన్నీ తెలిసినా నీవు ఏది యోగ్యమో అది అందజేయు నీకు వందనములు.

బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ
మన్వస్త్ర నాగదళ షోడశపత్ర యుక్తం
వృత్తత్రయంచ ధరణీ సదన త్రయంచ
శ్రీ చక్ర రాజ ఉదితః పరదేవతాయాః

Saturday, June 8, 2019

ఆధ్యాత్మ & కుటుంబ రాజకీయం

రాజకీయం ఒక వృత్తిగా స్వీకరించవచ్చు. కానీ, ఆఫీసుల్లో, స్కూళ్లలో, సంఘాలలో ప్రైవేటు విషయాలో రాజకీయం చేయడం అనేది పరమ చిరాకు విషయం. భగవదనుగ్రహంతో అలాంటి విషయాలను, వ్యక్తులను కనీసం నాదాకా రాకుండానే, వస్తూంటెనే ఆమడ దూరంలోనే నిలువరించగలిగాను.

ఐతే, ఆధ్యాత్మిక సంస్థలలో, ఆధ్యాత్మ వ్యక్తులమధ్య, కుటుంబ సభ్యుల మధ్య రాజకీయాలు చోటుచేసుకోవడం పరమ దారుణమైన విషయాలు. ఈ విషయాలలో రాజకీయం, కుట్రలు, చాడీలు పరమ అసహ్యకరమైన విషయాలు... మొగ్గలో ఉన్నప్పుడే తుంచాలి లేదా దూరంగా జరగాలి. అలా చేయలేకపోవడం ఆ కుటుంబ పెద్ద, ఆ సంస్థ పెద్ద యొక్క అసమర్థతగానే ఎంచాల్సి ఉంటుంది, నిస్సందేహంగా !

-శంకరకింకర

Saturday, June 1, 2019

దుర్వాస మహర్షి



(Whatsapp Collection, do not know the original author)
దుర్వాస మహర్షి, కంచి కామాక్షీ అమ్మవారి ఆలయంలో అనేక మంది భక్తులకి వారు ప్రత్యక్ష  దర్శనం ఇచ్చి అనుగ్రహించారు. కామాక్షీ అమ్మవారికి చందనోత్సవం చేసినప్పుడు ఇప్పటికీ, అమ్మవారి కుడి వైపు దుర్వాస మహర్షిని చూడవచ్చని, ఆ దర్శనం చేయగలిగిన సత్పురుషులకు వారు కనబడతారని పెద్దల విశ్వాసం. ఎంతో మంది శ్రీవిద్యోపాసకులకు దుర్వాసో మహర్షి ఆరాధ్య దైవం మరియు సద్గురువు. గురువు నుండి పొందిన శ్రీవిద్యా మంత్రాలు, ఏ కొంచెమైనా కూడా, పూనికతో కామాక్షీ ఆలయంలో అనుష్ఠిస్తే, వారికి తప్పకుండా దుర్వాసో మహర్షి అనుగ్రహం లభిస్తుందనీ, వారికి ఆయనే ఉపాసనలో ముందుకు నడిపించే దిశానిర్దేశం చేస్తారనీ ఎంతో మంది భక్తుల అనుభవం. 

దీనికి ఉదాహరణ, తమిళనాడులోని తిరుచిరాపల్లిలో మీనాక్షీ అమ్మళ్ అని ఒక తల్లి ఉండేది. ఆమెకి చాలా చిన్న వయసులోనే ఆమె మామగారే గురువై శ్రీవిద్యా దీక్ష ఇచ్చారు. అయితే, ఆమె ఎన్నో రోజులు సాధన చేయకమునుపే, ఆ గురువు (ఆమె యొక్క మావగారు) తనువు చాలించారు. అప్పటికి ఆ తల్లికి శ్రీవిద్యోపాసనలో ఇంకా సాధనాబలం లేదు. ఆమెకి గురువు గారు ఇచ్చిన మూలమంత్రము ఒక్కటే తెలుసు.

ఆమె ఆ మూలమంత్రమునే భక్తితో కొంత కాలం సాధన చేసింది. అయితే ఆమె తరచుగా తిరువారూర్ లో ఉన్న కమలామ్బికా అమ్మవారి క్షేత్రములో కూర్చుని ఆ మంత్ర జపము చేసేది. ఒకనాడు, అదేవిధముగా ఆ ఆలయములో జపం చేస్తూ ఉంటే, మంచి స్ఫురద్రూపి అయిన ఒక వృధ్ధుడు ఆమె యెదుటకి వచ్చి, నువ్వు కంచిలోని శ్రీవిద్యా పరమేశ్వరీ అమ్మవారి సన్నిధికి (అంటే కామాక్షీ అమ్మయే) వెళ్ళు, అక్కడ నీవు చేసే మంత్ర జపమునకు న్యాసము (కరన్యాసము, అంగన్యాసము) కూడా దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. ఆమె వెంటనే కంచి కామాక్షీ అమ్మవారి సన్నిధికి వెళ్ళింది. ఆశ్చర్యంగా ఆమెకి ఇక్కడ కూడా అదే వృధ్ధుడు దర్శనమిచ్చి, అక్కడ అమ్మ వారి ప్రాంగణములోనే ఉన్న మరొకరిని చూపించి ఆయనని ఆశ్రయించమని చెప్పారు. వెంటనే ఆ తల్లి పరుగు పరుగున వెళ్ళి వారి పాదములకు నమస్కారం చేసి, జరిగినదంతా చెప్పింది.

ఆ పెద్ద మనిషి మైసూర్ కు చెందిన శ్రీ యజ్ఞనారాయణ శాస్త్రి అనే ఒక గొప్ప శ్రీవిద్యోపాసకుడు. శాస్త్రి గారు, నేను నీకు ఎలా తెలుసమ్మా అని ఆవిడని అడిగితే, ఆ తల్లి వెనుకకు తిరిగి, అక్కడ నిల్చున్న వృధ్ధుడిని చూపించింది. విచిత్రముగా, ఆ వృధ్ధుడు శాస్త్రి గారు, ఆ తల్లి ఇద్దరూ చూస్తుండగా అంతర్ధానం చెందారు. తదుపరి ఆ తల్లి కామాక్షీ ఆలయంలో ప్రదకక్షిణ చేస్తూ ఉండగా, దుర్వాస మహర్షి సన్నిధికి వచ్చి నమస్కరించగానే, అక్కడ అంతర్ధానం చెందిన వృధ్ధుడే దుర్వాస మహర్షి మూర్తి యందు కనబడి, ఆమెను దీవించారు. ఇది నిత్య సత్యమైన లీల. ఇప్పటికీ ఆ తల్లి ప్రతీ యేటా కంచి వెళ్ళి అమ్మ దర్శనముతో పాటు, దుర్వాస మహర్షి యొక్క దర్శనము కూడా పొందుతారు.