Pages

Sunday, February 27, 2011

ఉత్తరాయణ పుణ్యకాలం

మనకందరికీ నక్షత్రాలు 27 అని బాగా తెలుసు. మళ్లీ ఒక్కొక్క నక్షత్రానికి
నాలుగు పాదాలు. ఒక్క నక్షత్రానికి నాలుగు పాదాల లెక్కన 108 పాదాలుగా
నక్షత్రాలు విభజించారు. తిరిగి 108 పాదాల్ని 12 రాశులుగా విభజించారు.
ఇందులో భాగంగా... సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ
రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరించబడుతోంది. ఇలాగే...
మకరరాశిలో సూర్యుడు ప్రవేశించినపురోజుని మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణం అంటారు శాస్త్ర, పురాణాల వాక్కు.
(నేటి వైజ్ఙానికులకు, అంతా ట్రాష్ అనుక్కునేవారికి ఇది విచిత్రంగానో
మూఢనమ్మకంగానో తోచవచ్చు లేదా ఈ జ్యోతిష్యం, సూర్యుడు, నక్షత్రాలు బ్లా
బ్లా బ్లా అని అనుక్కోనూవచ్చు. పాపం వారికి తెలియనిదేమంటే భౌగోళికంగా
కూడా ఈ సంక్రాంతి రోజు నుంచీ భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు మిగిలిన
ఆరు నెలలపాటు కొంచెం సూర్యుని వైపు మొగ్గి (TILT) తిరుగుతుంది. దాని వలన
సూర్యుని ఆకర్షణ శక్తి భూమి మీద పడి తదనుగుణ లక్షణాలు , సూర్య తరంగాలు
భూమి మీద ఉండేవారి మీద ప్రసరిస్తాయి. దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలమని
పెద్దలు నిర్ణయించారు, దీని వెనకున్న శక్తినే మనం దైవం అంటాం, పాపం
వారికేమనాలో తెలియక తంటాలు పడుతుంటారు. అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా కదా మరి, అలా వెతికేస్తే చేతికి దొరికేస్తుందేమిటి
పరబ్రహ్మం...)
సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి కర్కాటక
రాశిలోకి ప్రవేశించే వరకు దేవతలకు పగలుగా ఉంటుంది. ఈ సమయాన్నే ఉత్తరాయణం అంటారు. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనూరాశిలో ప్రవేశించే వరకు దేవతలకు రాత్రిగా ఉంటుందని శాస్త్ర వచనం
అందుచేత ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది... కాబట్టి.. దేవతలకు పగటి
కాలంలో యజ్ఞయాగాదులు చేసి వారి అనుగ్రహాన్ని పొందమని మకర సంక్రాంతి
సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే... ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని
కలిగిస్తుందని విశ్వాసం. అంతే కాదు దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం
దక్షిణాయనం లో మరణిస్తే ఉపాసన చేసుకునే అవకాశం పోతుందని పెద్దలు ఊర్ధ్వ
ముఖ రేతస్సు కలవారు తమ మరణాన్ని ఉత్తరాయణంలో పొందేవారు. అందుకే పూర్వం భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛంధ మరణాన్ని కోరుకున్నాడు.

No comments:

Post a Comment