Pages

Sunday, February 27, 2011

విద్=దివ్ ; వేదం= దైవం

శ్రీ గురుభ్యోన్నమః
శ్రీగణేశాయ నమః
మన సనాతన ధర్మంలో ఈ రెండు అక్షరాలు ఎంతో ప్రభావవంతమైనవి. అసలు ఈ రెండు అక్షరాలే కీలకం, మూలం. ఈ రెండు అక్షర సమాహారాలైన పదాలు రెండు లే మన ధర్మానికి ఆమ్లజని (ఆక్సిజన్).
అవే 1) వేదం 2) దైవం రెంటిలోనూ వున్నవి వ్,ద్, ౦,  మూడింటిలో ఒకటి పూర్ణం
తీసేస్తే ఉండేవి వ్,ద్
విద్ అనే ధాతువు నుండు పుట్టునది వేదం
విద్ = తెలుసుకొనవలసినది
తెలుసుకోవలసినది ఏది = జ్ఙానము
జ్ఙానము వలన సిద్ధించునది =  అజ్ఙానమనే చీకటి తొలగుట
అజ్ఙానమనే చీకటి తొలగుట = జ్ఙానమనే వెలుగు ప్రసరించుట
వెలుగు ప్రసరించుట = ప్రకాశము చెందుట
ప్రకాశము = భాసించుట (భాః = కాంతి క్ భాః+కరుడు =భాస్కరుడు
వెలుగునిచ్చువాడు)
భాసించునది = దివ్
దివ్ రూపాంతరం దైవం
వేదమును వేద హృదయమును తెలుసుకొనటం ద్వారా దైవమును చేరవచ్చు.
మొత్తానికి పూర్ణం ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవా వశిష్యతే !! ఓం శాంతి శ్శాంతి శ్శాంతి:!!
(అచ్చుతప్పులుండచ్చేమో)
అందుకే మన ధర్మములో వేదమునకు దైవమునకు అభేదం వేదము అపౌరుషేయం, దైవం యొక్క శ్వాస. వేదమును కేవలంగా కుక్షింభరత్వానికో మరి దేనికో చదువుట తనంత తానుగా దైవసాక్షాత్కారమును చేయించలేదు. అందుకు గల మార్గములను చెప్తుంది (like a directory or road map to show the address, but not the address
itself). వేదమువలన దైవము ఎక్కడ ఉన్నదో తెలియబడుతుంది. ఆ శ్రుతి
ప్రమాణములని వాక్యములను గురు బోధ వల్ల అంతర్ముఖత్వమున మననము చేయగా చేయగా పొందిన విద్ వల్ల దివ్ తెలియబడుతుంది.
నాకు సంస్కృతం రాదు ఐనా నాకు మొన్న ఒక రోజు వచ్చిన ఆలోచన తదనుగుణంగా జరిగిన అంతః చర్చను అక్షర రూపంగా ఇక్కడ పెట్టాను.
వేదమే ప్రమాణము - ధర్మమే ఆచరణీయము
సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు

No comments:

Post a Comment