Pages

Friday, August 12, 2016

విద్వాంసుడు పామరులను భ్రమింపచేయకూడదు..

శ్రీ గురుభ్యోనమః

          విహిత కర్మలనొదలండి జ్ఞానం పట్టుకోండి అనే వాక్కులతో భ్రాంతి కలిగించే వారినుండి మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. నీటి స్నానం అక్కరలేదు జ్ఞాన స్నానం చేయండీ అంటూ చెప్పేవారి పట్ల అప్రమత్తతో మెలగాలి. బట్టల రంగు మార్చి ఆచారవ్యతిరిక్తంగా మన ప్రవర్తనను ప్రోత్సహించేవారినుండి మనని మనం కాపాడుకోవాలి. సంప్రదాయదూరులూ, అనాచారులూ ఐన వారు ఎంత చదివినా గొప్పగా తియ్యని మాటలు (చార్వాక్కులు) మాట్లాడినా వారు మూర్ఖవదుపేక్షణీయః అని శంకరులు చెప్పారు ... సనాతనులను ధర్మదూరులుగా కర్మలోభులుగా మార్చే ప్రయత్నాలనుండి దూరంగా మనకి మనం ఉండాలి. శాస్త్రాలెందుకు, వేదాలెందుకు, కర్మలెందుకు అనేవారినుండి ఎంతో జాగ్రత్తగా మనముండవలె.

శంకరులు ఆత్మ బోధ అనే గ్రంథాన్ని ఎందుకై, ఎవరికై ఇస్తున్నారో మొట్టమొదటి శ్లోకం చేస్తూ చెప్పారు.

తపోభిః క్షీణ పాపానాం - శాంతానాం వీత రాగిణాం
ముముక్షూణాఽమపేక్ష్యోయం - అత్మబోధీ విధీయతే (01)

తాత్పర్యం: తపస్సుచేయటం చేత క్షీణమైన పాపముకలవారికినీ, ప్రశాంత చిత్తులకునూ, రాగద్వేషాలు విడిచినవారికినీ, మోక్షమునందు కోరిక కలిగినవారునూ కోరుకునే ఆత్మబోధ అనే ఈ ఆత్మ జ్ఞాన సంబంధమైన గ్రంథం ఇవ్వబడుతున్నది.

        కాబట్టి, బ్రహ్మవిద్య లేదా ఔపనిషద్ విద్య సార్వజనీకంగా ప్రవచించడం అంత శ్రేయస్కరమైనది కాదు. చిత్తశుద్ధి పొంది జ్ఞానమును ఇంకా పొందని వారు వేదవిహితమైన కర్మలను ఆచరించి చిత్తశుద్ధి పొంది జ్ఞానమును పొందుటకు గురువునాశ్రయించినపుడు బ్రహ్మవిద్యను ఏంకాతమున లేదా అతి కొంతమంది ముముక్షువులైన జిజ్ఞాసువులకు బోధించదగును. లేకపోతే ఆతురతచే లేక బుద్ధిదోషముచే పరిపక్వముకాకున్ననూ జ్ఞాన కాంక్షచే విహితకర్మాచరణమును వీడే ప్రయత్నం చేస్తారు.. అది కూడని పని. పైగా ఒకవేళ ఎవరైనా విహితకర్మాచరణం సరిగ్గా చేయాకపోతే సరిదిద్ధి సరిగ్గా ఆచరించేలా చూడాలి కానీ ఇంకా అనాసక్తి అశ్రద్ధ పెరిగేలా చేయకూడదు, అలాంటి మాటలు చెప్పకూడదు.

ఈ విషయాన్ని భగవానుడు గీతలోకూడా ఈ విధంగా చెప్పాడు భగవద్గీత 3 వ అధ్యాయములో ఇలా చెప్తారు...

"న బుద్ధిభేధం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్!
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్!!

        విహితధర్మపు ఫలముల యందు ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలతపడి అనుమాన పడే రీతిగా విద్వాంసుడు పామరులను కర్మ నుండి నిగ్రహింపకూడదు (దృష్టి మరల్చరాదు) . అనగా పరమాత్మ స్వరూపమునందు నిశ్చలస్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించేవారి బుద్ధులను భ్రమకులోనుచేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధకలిగించరాదు. తానుకూడా శాస్త్రవిహితములైన కర్మలను విహితవిధిన చేసి ఇతరులతోనూ అట్లే చేయించవలెను. అంటే ఒకరికి చెప్పవలసినది మరొకరికి చెప్పి భ్రమింపచేసి ఆచరణ దూరులను కావించరాదు.

So, please be choosy in sharing / teaching vedanta related topics as Brahma vidya / Upanishad vidya is to be taught in person (one to one or with small group of shishyas who are mumukhsu and has jignyasa) Should never be taught in open dais or broadcast them like purana pravachanam... may be one can use it as reference should not teach them openly without assessing the anushthana level of sadhaka(s).




1 comment: