Pages

Saturday, September 19, 2015

దేవీ మహాత్మ్యము 2

శ్రీ గురుభ్యోనమః
……..
ఇక సప్తశతి ఎప్పటిది అంటే అది సనాతనం. సనాతనమైన వేదవేదాంత సారమే సప్తశతి. ఇలాంటి సారభూతమైన వాఙ్మయమే మరొకటి మనకి కపడేది భగవద్గీత... రెండూ మోహ విచ్చేదం చేయడం కోసమే వచ్చాయి. భగవద్గీత అర్జునుడు మోహపడి యుద్ధం చేయనంటే కృష్ణుడు బోధచేసాడు చివరలో అర్జునుడే నష్టోమోహః స్మృతిర్లబ్దః అని చెప్తాడు. అలాగే దేవీమహాత్మ్యం సురథుడు సమాధి అనే ఇద్దరు వ్యక్తుల మోహాన్ని పోగొట్టడానికి సుమేధ చెప్పే అమ్మవారి ఆఖ్యానాలతో మొదలై చివర్లో వారి మోహం పోయి వారుకోరుకున్న లౌకిక పారలౌకిక వాంఛలు తీరుతాయి.

సప్తశతికి ఎందరో మహానుభావులు భాష్యాలు వ్రాసారు. ప్రస్తుతం గుప్తావతి అనుపేర భాష్యం సంస్కృతంలో లభిస్తున్నది. అలానే విరివిఐన వివరణ శ్రియానందులు రచించారు. గౌడపాదులవారు దీనికి భాష్యం రచించారు అలాగే శాంకర భాష్యం ఉన్నదని ప్రతీతి కానీ ప్రస్తుతం దాదాపు అలభ్యం. దీనికి ప్రస్తుతం లభిస్తున్న అతి ప్రాచీన భాష్యం శాంతనవి. భీష్ముని తండ్రిఐన శంతన చక్రవర్తి వ్రాసినది. అంటే ఎంత ప్రాచీన భాష్యమో తెలుస్తున్నది. ఇది అంతకన్నా ప్రాచీనము. ఇది మార్కండేయ పురాణంలోదే ఐనా దీనికి కర్త మార్కండేయుడు కాదు ప్రవాచకుడు మాత్రమే...
మనం ఒకటి గుర్తుంచుకోవాలి, భగవద్గీతైనా, ఇతిహాసమైనా, పురాణమైనా, తంత్ర గ్రంథాలైనా, ఆగమాలైనా వేదాన్ని అనువర్తించినపుడే అవి ప్రమాణాలు, వేదదూరమైనవి ప్రమాణ వాఙ్మయం కానేరదు. కాబట్టి ఆయా వాఙ్మయ వ్యాఖ్య కూడా తదనుగుణంగా ఉండాలి తప్ప అవైదిక మార్గంలో వేదహృదయాన్ని విడిచి చేసిన భాష్యాలు ఎంత అందంగా ఆకర్షణీయంగా వినసొంపుగా తియ్యని మాటల్లా (చార్వాక్) ఉన్నా ఒక్కనాటికీ వైదికములు కానేరవు.

మొదటి అధ్యాయం గురించి కొద్దిగా...
చండీవిద్య స్వతంత్ర విద్య, లౌకికమైన కోరికలకూ, పారలౌకికమైన మోక్షాపేక్ష కలిగినవారికీ కూడా కొంగుబంగారంఅది చూపడానికే మనకి కథలో క్షత్రియుడైన సురథుడు వైశ్యుడైన సమాధి కనిపిస్తారు వీరికొరకు మంచి మేధస్సు కల గురువు బోధ చేస్తారు. కథని ఎవరి కథో ఎప్పటి కథో అని కాక దాన్ని పరిశీలిస్తే సురథుడు సమాధి సుమేధ మనలోనే ఉంటారు మన పక్కనే చుట్టూనే ఉంటారు. అందులో చెప్పిన రాక్షసులు మొదలైన వారు కూడా మనలోనూ మన సమాజంలోనూ కనిపిస్తారు.

ఇంద్రియాణి పరాణ్యాహు.. అని కదా ఇంద్రియాలే గుఱ్ఱములై నడిపే రథము మన శరీరమే. ఎవరి శరీరమైనా బాగుండాలనేగా కోరుకునేది అందుకే ఎవరి శరీరం వారికి సురథమే. శరీరాన్ని కాపాడుకోవడం ధర్మ కార్యాలు చేయడం భార్యా పిల్లలతో ఐశ్వర్యం ఇత్యాది అన్నీ ధర్మంగా పొంది అనుభవించడం ఇవన్నీ సురథుడు చేయవల్సినవే.. వాటికొరకు శ్రమించవలసినదే. దానికి సంబంధించి ఉపాయం (ఇక్కడ రాజ్యం పాలించడం అనే ఉద్యోగం) పోయింది భార్యా పిల్లలు, రాజ్యం మీద మోహంతో ఉన్నాడు. క్షత్రియతత్త్వం. ఇంద్రియాలు మనసు

ఇక సమాధి ఈయనకు బుద్ధి విశేషం ఎక్కువ, విచక్షణా జ్ఞానం కలవాడు, తన వ్యవసాయాత్మిక బుద్ధితో ఏది పుత్తడి ఏది ఇత్తడి తెలుసుకోగలడు కానీ స్థిరబుద్ధి కాకపోవడం చేత మోహం ఉంది ఇది వైశ్య ప్రవృత్తి. భగవంతుడి పాదాలు దొరికితే చాలు ఈజన్మకి ఏమఖ్కర్లేదంటాం.. తిరుమలలో గుడికెళ్ళి దణ్ణం పెట్టుకుంటూ భార్యాపిల్లలు ఎక్కడున్నారని అంతరాలయంలో వెతుక్కుంటాం... బుద్ధి...

ఇద్దరూ మనమే.... మనలోనే సురథుడున్నాడు మనలోనే సమాధి ఉన్నాడు... స్థాయీబేధాలు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తాం మోహంతో... వాఙ్మయంలో మనకన్నీ తెలిసినట్టే ఉంటుంది ఏదైనా ఎవరైనా చెప్దామని మొదలెట్టగానే అది ఇలాగండి అలాగండి అని మనం చెప్పేస్తాం... కానీ జ్ఞానం నోటి మాటవరకే తప్ప శరీరంలో జీర్ణమవదు. అది అప్పటికే తప్ప చక్కగా స్థిరీకరింపబడినది కాదు. అందుకే ఆచరణలో ఉండదు... అందువల్ల ప్రశాంతత ఉండదు.

వీళ్ళిద్దరూ వెళ్ళి (ఇంద్రియాలతో కూడిన మనస్సు + బుద్ధి) వెళ్ళి మేధస్సునడిగారు. ఆయన గురువు. గురు వాక్యం సింహనాదం. ఒక్కసారి అదివినపడితే అజ్ఞానం పటాపంచలైపోతుంది. గురువుని లఘువుగా భావించిన వాని కర్మ పరీపాకం కాలేదని అర్థం. కానీ సురథ సమాధులిద్దరూ వెళ్ళి మాకు జ్ఞానం ఉంది కానీ మా కుటుంబ సభ్యులమీద మోహం పోవట్లేదు అని సుమేధ దగ్గర మొరపెట్టుకున్నారు. అప్పుడు సుమేధ సున్నితంగా మందలించి మీకు తెలిసిందేది అసలు తెలివి కాదు అని ఉపనిషత్తుల్లో చెప్పబడినఉమతత్త్వాన్ని బోధిస్తూ ఆఖ్యానాలరూపంలో అమ్మవారి అవతారాలని ప్రస్తుతిస్తాడు. అందులో నిబిడీకృతమైన జ్ఞాన బోధ చేస్తారు...

చండీ సప్తశతి ప్రథమాధ్యాయానికి ప్రథమ చరిత్ర అని పేరు అధిష్ఠాన దేవత మహాకాళీ స్వరూపం... మంత్రం లేనివారు హవిర్భాగం ఇచ్చేటప్పుడుశ్రీ మహాకాళ్యైఇదం మమఅని చెప్తూ ఇవ్వాలి... 

సశేషం...

No comments:

Post a Comment