Pages

Sunday, May 1, 2016

ఈశ్వరుడు సతీదేవితో చెప్పిన మాటలు


నిరహంకార నిరస్తపాప సుజనానింద్యోల్లస త్కీర్తి గొం
దరు కామించి యశక్తులై మనములన్ దందహ్య మానేంద్రియా
తురులై యూరక మచ్చరింతురు; మహాత్ముండీ శ్వరుండైన  యా
హరితో బద్ధ విరోధముం దొడరు దైత్యశ్రేణి చందంబునన్.
అహంకారమూ, దోషములు లేనివారు కావటం చేత సజ్జనులకు గొప్ప కీర్తి లభిస్తుంది. అట్టి కీర్తి తమకూ దక్కాలని కొందరు కోరుకుంటారు. కానీ, వారు అసమర్ధులు కావటం వల్ల వారికి ఆ కీర్తి రాదు. అందుచేత మనసులో కుతకుత ఉడికిపోతారు. భగవంతుడైన విష్ణుమూర్తిపై రాక్షసులు పగను పెంచుకున్నట్లు, కారణం లేకుండానే దుర్జనులు సజ్జనులపై అసూయను పెంచుకుంటారు. (పోతన భాగవతం - ఈశ్వరుడు సతీదేవితో చెప్పిన మాటలు)                                

No comments:

Post a Comment