Pages

Monday, June 17, 2013

అన్ని భూమికలలోని వారినీ ఉద్ధరించేది సనాతన ధర్మం

శ్రీ గురుభ్యోనమః
నమస్తే
  
సనాతన ధర్మం చాలా మంది అనుక్కునట్లు ఒక్కరిద్దరినో లేదా ఒక వర్ణం వారినో ఒక ఆశ్రమం వారినో మాత్రమే ఉద్ధరించేది కాదు. తత్వ్యతిరేక భావనలు సిద్ధాంతాలు ప్రచారం చేసే మతాలు అందరినీ ఉద్ధరించేవి కావు. సనాతన ధర్మంలో ఫలానా వ్యక్తి ఉద్ధరణకి పనికిరాడు అన్న విధానము సిద్ధాంతము లేదు, నువ్వు ఇలా లేవు కాబట్టి నిన్నస్సలు ఉద్ధరించడం నువ్వు ఉద్ధరణవేపుకి వెళ్ళడం కుదరదు ధర్మంలో అని లేదు. అన్ని రకాల విభిన్న విశేషాలున్న వ్యక్తులైనా సరే  అన్ని భూమికలలోని వారిని ఉద్ధరించగలిగే ఏకైక ధర్మం మన సనాతన ధర్మం అందుకే దానికి సార్వభౌమ ధర్మం అని పర్యాయం.

సనాతన ధర్మంలో ఖచ్చితంగా
-ఒక పండగ చేసుకోవలసిన తీరులో చేసుకొని ఉన్నతిని పొందవచ్చు, ఒక్క ఏకాదశి, ఒక్క శివరాత్రి చాలు.
-నిరంతరం ఒక స్తుతి చదివుతూ ఉన్నతిని పొందచ్చు, ఏమీ వద్దు కేవల భగవన్నామ స్మరణం చాలు.
-ఎన్ని తప్పులు చేసినా తప్పు తెలుసుకొని సంపూర్ణ ప్రాయశ్చిత్త చిత్తంతో శరణాగతిద్వారా ఉన్నతిని పొందచ్చు, దీన్ని కన్ఫెషన్స్ తో పోల్చడం కన్నా తెలివితక్కువతనం లేదు.
-మరణం తరవాత చేసుకొన్న మంచి, చెడు కర్మలను బట్టి ఊర్థ్వ/అధోలోకాలుంటాయి. అది ఆశచూపడం కాదు అది సనాతన ధర్మ మూల సిద్ధాంతాలలోఒకటైన కర్మ సిద్ధాంతం. దీన్ని ప్రశ్నించేవాడు ధర్మంలో చరించేవాడే కాదు. అవైదిక మతంలో చరిస్తూ ప్రచారం చేస్య్కొనేవాడికన్నా అసలు వాడే ధర్మానికి బద్ధవిరోధి కూడా.
-జీవన్ముక్తులు అనే పదం లేదా పదం అన్వయమయ్యేది సనాతన ధర్మంలోని వారికే, అక్కణ్ణుంచే ఇతర మతాలు అరువెత్తుకెళ్ళాయి. ఇక్కడే ఇప్పుడే బ్రతికుండగానే ఆత్మ స్వరూపుడవు కావచ్చు, సత్యం తెలుసుకొవచ్చు అనేది కేవల సనాతన ధర్మ సిద్ధాంతమే, ఇతరత్రా మనిషి బుద్ధిలోంచి పుట్టినది కాదు.
-తెలిసో తెలియకో మహాత్ములు తిరుగాడిన ప్రదేశాలలోగానీ, ఆశ్రమాలలోగానీ, వారు వసించిన ప్రదేశాలలోగానీ, పుణ్యక్షేత్రాలలోగానీ ఎందుకు తిరిగినా ఎప్పుడు ఎలా తిరిగినా అది కేవల భగవత్సంకల్పం దానివల్లనూ ఉన్నతమైన ఫలితాలుంటాయి, ఒక్క నదీ స్నానం చాలు, ఒక్క తీర్థ నమస్కారం చాలు ఉద్ధరింపబడడానికి. తప్ప అది గొఱ్ఱెలు, పందులు రొచ్చులోపడి తిరిగేలాంటి చందంకాదు.
-హాస్యోక్తులలో భగవన్నామం తలచుకున్నా భగవంతుడుద్ధరిస్తాడు
- ఇంకా ఎన్నో రకాలు, ఒకటి కాదు రెండుకాదు ఎంతమంది ఎలా ఉద్ధరింపబడ్డారో అని తెలుసుకోవడానికి ఎన్నో ఉదాహరణలు కోకొల్లలు
-ఎన్నో ఎన్నో విధాల అందరినీ ఉద్ధరించగలిగే ధర్మం నా సనాతన ధర్మం - సార్వభౌమత్వం ఉన్న ఏకైక ధర్మం

భగవత్తత్వం పరిశీలించి అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించే తత్త్వజ్ఙ్యుడైనా, అపార భక్తి విశేషం కలిగిన వాడైనా, తీర్థయాత్రా సేవనం చేయగలిగే వాడైనా, ఏమీ లేకపోతే రోజూ నియమంగా నమస్కారం పెట్టుకునేవాడైనా సరే... ఆఖరికి జీవిత పర్యంతమూ ఎటువంటి భగవత్ సంబంధ విశేషంమీద అనురక్తి లేకున్నా వ్యక్తి జీవితంలోని నీతి నిజాయితీలనుబట్టి ఉత్తరజన్మోద్ధరణం సూచిస్తుంది మన ధర్మం. మన ధర్మం, మన ఆలయాలు, తీర్థ క్షేత్రాలు వాటి సందర్శనం చేసేవాళ్ళని చులకన చేయడం వాళ్లని బుద్ధిహీనులుగా చిత్రీకరించడంలేదా అలా అనుక్కోవడం అదీ పెద్దలుగా చెలామణీఅవుతూ చేస్తుంటే అది కుపాండిత్యమేతప్ప ఉపాధిలో పండిందిఏమీలేదు అంతా అపక్వమైన జ్ఞానమని తెలుస్తుంది. ’జ్ఞానఖలుని యోని శారదయోలెఅన్నట్లు ఉన్నత విషయాలు తెలుసుకోవడం కాదు అది ఆచరించి అడుగున ఉన్నవారి భావనా సౌకుమార్యాన్ని గ్రహించి వారినీ కలుపుకుని వెళ్ళలేకపోలేని వాళ్ళని చూస్తే ఉన్నతుడుగా కనపడుతున్నా స్థితిలోఉన్నారో అర్థం అవుతుంది. తక్కువ స్థాయిలో ఉన్న జనాలని చూసి పై స్థాయిలో ఉన్నవాడు చీదరించుకోనక్కరలేదు అలా అని తలకెత్తుకుని తిరగక్కరలేదు. వారి భావనలని ఉన్నతివేపుకు నడిపించే విధంగా మాట్లాడగలిగి మంచి పంచుకోగలగాలి. వినక మొండిగా వాదిస్తే ఊరుకోవాలి.
 గుళ్ళూ గోపురాలు పూజలు ఎందుకున్నాయో తెలియకుండానే జనాలున్నారని చెప్పేటప్పుడు అవి ఎందుకున్నాయో విప్పి చెప్పగలిగేంత సమర్థత ఉండీ చెప్పక, అన్యులని మనుష్యులకన్నా తక్కువ జాతి జీవులతో పోల్చి అవమానిమ్చడం హేయం. వాళ్ళను చూసి చీదరింపులెందుకు? అదేదో సినిమాలోలాగ దీన్నే మా ఊళ్ళో..... ’అహంకారంఅంటారు. పుంఖాలు పుంఖాలు రాతలు కాదు చేతలేవీ? నీకంత విషయ పరిజ్ఞానం ఉంటే పంచుకో ఓపికలేకపోతే నీ అనుష్ఠానం నువ్వు చేసుకో తప్ప సామాన్య జనాన్ని వెర్రి వెర్రి భావజాలంతో పదజాలంతో గుళ్ళూ గోపురాల్ని తీర్థాల్ని రొచ్చుల్తో పోల్చడం ఖచ్చితంగా నేరం.

గుళ్ళూ గోపురాలు పూజలు మనిషిలో మార్పును, తద్వారా సమాజంలో శాంతి సౌభాగ్యాలను పెంపొందించే కేంద్రాలు. మానవజాతి ఉన్నతికి పాటుపడేవి గుళ్ళు గోపురాలు పూజాదులేనని మాత్రం తెలివున్నవారికైనా స్పష్టంగా ప్రకటంగా కనపడుతుంది. అవి అంతర్లీనం కావు. సనాతన ధర్మంలో రెండు రకాల ఉపాసనలూ ఉంటాయి ఒకటి అంతర్ముఖత్వంతో చేసేవి, రెండు బహిర్ముఖంగా సామూహికంగా చేసేవి. తప్పబద్ధకపుసిద్ధాంతాలు ప్రకటించే మతంతో పోల్చవలసిన దుస్థితి సనాతన ధర్మానికి లేదు, అలా చేసే తేడాబుద్ధిఉన్నవారుండొచ్చు.

సాటి మనిషిని సాధనలోఉన్నవాణ్ణి కనీసం వాడి స్థాయికి తగ్గట్టు చూడక, వాళ్ళు తెలిసో తెలియకో చేసే తప్పులో పొరపాట్లో చూసి వీలైతే నచ్చచెప్పి మార్పించాలి, వినకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి, తప్ప కలిసిన ప్రతివాడినీ, వాణ్ణి ఇలా తిట్టాను వీణ్ణి ఇలాదులిపాను అనే హక్కెక్కడిది. సనాతన ధర్మంలో ఒకరిని అలా తిట్టాలంటే కేవలం తల్లి దండ్రులయ్యుండాలి లేదా గురువైయుండాలి లేదా అవతలి వ్యక్తికి గురుతుల్యుడయ్యుండాలి. అనవసరంగా లేని పెద్దరికాన్ని అన్యమతంలోని నాలెడ్జితో తెచ్చిపెట్టుకొని ఈధర్మంలోని వారిని కడగక్కరలేదు అవసరమైతే నీ బుద్ధితో నీకు నచ్చిన మతావలంబనం చేస్కోవచ్చు మా సనాతన ధర్మానికి ఏం నష్టం లేదు. పనికిరాని బుద్ధి ప్రోది చేసుకున్నవారికి ఇవన్నీతెలియంది కాదేమో బహుశా...

ఐనా బుద్ధిలేని ఆచరణ శూన్యమై, అర్థరహితమైన సిద్ధాంతలతో ఉన్న మతాలని పొగిడేవారికేంతెలుస్తుంది సనాతన ధర్మ ఔన్నత్యం............... అదేదో పాండ్స్ పౌడర్ వాసన సామెత లాగ.

ధర్మస్య జయోస్తు - అధర్మస్య నాశోస్తు
వేదమే ప్రమాణం - సనాతన ధర్మం సార్వభౌమికం
హర హర శంకర - జయ జయ శంకర