Pages

Wednesday, July 11, 2018

రామాయణం చదవడమంటే అక్షరాలు ఘట్టాలు చదవడం కాదు

దుస్తర్కాత్ సువిరమ్యతాం...

నలుగురి మధ్యలో చర్చ.. కుతర్కం ఎగేసుకుంటూ వెళ్ళడం. వద్దయ్యా అంటే మన వాయిస్ ఉండద్దా అని తిరిగి సుద్ధులు, సాధించిందేమిరా అంటే... వ్యక్తిగత దూషణలు ఆపై దైవ దూషణలు, నలుగురి మధ్య వైరం సమాజ పరం చేయడం అంటే ఇదే.  ఇప్పటికైనా పండితులు, విజ్ఞులు కుతర్కాలకెందుకెళ్ళరంటే ఇందుకే అని అవగతమవాలి. అవతలవాడోటంటాడు ఇవతలి వాడు తన ప్రశాంతతని కోల్పోయి ఇంకో రెండంటాడు అక్కణ్ణుంచి ఇలాంటి గొడవలు. లేకపోతే వీళ్ళకన్నా పండితులు లేరనా, వీళ్ళేమైనా శాస్త్రార్థాలలో ప్రతివాదభయంకరులనా. కుతర్కం కూడదు అని శంకరులు ఘాట్టిగా వక్కాణించినదిందుకే.


రాముడు రాముడని గోలకాదు వ్యక్తిగత వైరం వస్తే ముందు లోకాలన్నింటినీ తన బాణాలతో కప్పి లయం చేస్తానన్న రాముడే లక్ష్మణుడిమాటతో ఊరడిల్లి, నా వైరాన్ని లోకానికి కీడుగా మార్చను అని చెప్తాడు. అలా కాదనుకుంటే తన వ్యక్తిగత వైరంకోసం క్షణంలో సీతమ్మనెత్తుకెళ్ళిన వాడితో సహా లోకాలను లయం చేసి ఉండేవాడు. పండితుడు ధార్మికుడు లోకాన్ని స్థంభింపజేయటానికో, అతలాకుతలం చేయటానికి తన శక్తినుపయోగించడు. శాంతిని పంచడానికుపయోగిస్తాడు. అందుకే రాముణ్ణి పండితుడంటారు, సాధుపుంగవుడంటారు.


రామాయణం చదవడమంటే అక్షరాలు ఘట్టాలు చదవడం కాదు, రాముడి నడతను అంటే రాముణ్ణి చదవడం.  రాముణ్ణి జీర్ణించుకోవడం.

-శంకరకింకర.

1 comment:

  1. రాముణ్ణి తెలుసుకుంటే రాగాలన్నీ నశిస్తాయని భయం .అందుకే విమర్షతో సరిపెట్టుకుంటున్నారు కుపండితులు

    ReplyDelete